

వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు, కేరింత వంటి చిత్రాలతో ప్రేక్షకుల కు దగ్గరైన దర్శకుడు సాయి కిరణ్ అడివి ఇప్పుడు ‘16 రోజుల పండగ’ పేరు తో ఒక కొత్త చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సాయి కృష్ణ దమ్మాలపాటి హీరో గా పరిచయం అవుతున్నారు. గోపిక ఉదయన్ హీరోయిన్ గా నటిస్తోంది. రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నల కిషోర్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.
ప్రదా పిక్చర్స్ మరియు సాయి సినీ చిత్ర బ్యానర్ల పై సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి ఈ చిత్రాన్ని ప్రొడక్షన్ నెంబర్ 1 గా నిర్మిస్తున్నారు. తాజాగా జరిగిన పూజా కార్యక్రమాలతో సినిమా ఆరంభ కార్యక్రమం జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి కోన వెంకట్, కేకే రాధా మోహన్ స్క్రిప్ట్ అందించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల క్లాప్ ఇవ్వగా, టీజీ విశ్వ ప్రసాద్ కెమెరా స్విచ్ చేశారు. మొదటి షాట్కు దాగర సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు అల్లు అరవింద్, రవి దామోదర ప్రసాద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరై టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భం గా దర్శకుడు సాయి కిరణ్ అడివి మాట్లాడుతూ, '16 రోజుల పండగ’ ప్రారంభమైనందుకు చాలా సంతోషంగా ఉంది. షూట్ స్టార్ట్ కు వచ్చిన శేఖర్ కమ్ముల, సురేష్ బాబు, కోన వెంకట్, రాధా మోహన్ లకు కృతజ్ఞతలు. టైటిల్ను సజెస్ట్ చేసింది దర్శకుడు కృష్ణ వంశీ. ఆయన కథ విని బాగా నచ్చడం తో ఇదే పెట్టమని సూచించారు. ఆయనకు ధన్యవాదాలు” అని చెప్పారు.
నటి రేణు దేశాయ్ మాట్లాడుతూ, సాయి కిరణ్ ఈ కథను కోవిడ్ లాక్ డౌన్కు ముందే చెప్పాడు. అప్పుడే నాకు బాగా నచ్చింది, వెంటనే అంగీకరించాను. ఇందులో నేను అత్తమ్మ పాత్ర చేస్తున్నాను. మొదట్లో నా వయసుకు సరిపోతుందా అనిపించింది. కానీ పాత్ర చాలా అందంగా రాసుకున్నారు. సినిమా చూసే సరికి ప్రేక్షకులే ఆ పాత్ర ఎంత బాగుందో గ్రహిస్తారు. సాయి కిరణ్ చాలా సెటిల్డ్ డైరెక్టర్. అతనితో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన టీమ్కి థాంక్స్ అని వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!