

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రంభ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి వెంకటేశ్వరరావు కన్నుమూశారు. ఈ విషయాన్ని రంభ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. “నాన్నా.. మీ స్థానాన్ని నా హృదయంలో ఎవరూ భర్తీ చేయలేరు. నేను ఎంత ఇబ్బందులు పెట్టినా ప్రతిసారీ చిరునవ్వుతో అన్నింటినీ ఎదుర్కొన్నారు” అంటూ ఆమె ఎమోషనల్ పోస్ట్ చేశారు.
తండ్రి లేకుండా ప్రపంచం శూన్యంగా అనిపిస్తోందని, ఆయనను చాలా మిస్ అవుతున్నానని రంభ తన పోస్టులో పేర్కొన్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు ధైర్యం చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడకు చెందిన యూదీ విజయలక్ష్మి అలియాస్ రంభ 1990లలో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు. 2010లో వివాహం తర్వాత సినిమాలకు దూరమైన ఆమె ప్రస్తుతం విదేశాల్లో కుటుంబంతో నివసిస్తూ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!