
జనరల్

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రక్త చరిత్ర’ చిత్రం ఆయన కెరీర్లో ప్రత్యేక గుర్తింపు పొందిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకులు పరిటాల రవీంద్ర, మద్దెలచెరువు సూరి జీవితాల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2010లో రెండు భాగాలుగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో వివేక్ ఒబెరాయ్, సూర్య, సుదీప్, శత్రుఘ్న సిన్హా, రాధికా ఆప్టే, కోట శ్రీనివాసరావు కీలక పాత్రల్లో నటించారు.
తాజాగా ఈ చిత్రాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం నిర్ణయించింది. జూలై 17న ఈ సినిమాను భారీ స్థాయిలో థియేటర్లలో తిరిగి విడుదల చేయనున్నారు. ఒకప్పుడు సంచలన విజయాన్ని అందుకున్న ఈ చిత్రం రీ-రిలీజ్లో ఎలాంటి స్పందనను అందుకుంటుందో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!