
జనరల్

తన సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రియాంక మోహన్ కు అరుదైన అంతర్జాతీయ గుర్తింపు లభించింది. వరుస విజయాలతో కెరీర్లో ముందుకు సాగుతున్న ఈ యువ కథానాయికకు తాజాగా కీలక బాధ్యతలు దక్కాయి. ఈ పరిణామం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
భారతీయ యువతలో కొరియన్ సంస్కృతి, పర్యాటక ప్రాంతాలపై పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని కొరియా టూరిజం ఆమెను గౌరవ రాయబారిగా నియమించింది. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో ఆమెకు ఉన్న అభిమాన వర్గం, సామాజిక మాధ్యమాల్లో ఉన్న ప్రభావం ఈ ఎంపికకు కారణమని భావిస్తున్నారు. ఈ గౌరవం తనకు దక్కడం ఆనందంగా ఉందని పేర్కొన్న ప్రియాంక మోహన్, కొరియా సంస్కృతి, పర్యాటక విశేషాలను మరింత మందికి చేరవేసేందుకు కృషి చేస్తానని తెలిపింది. సినీ విజయాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అభిమానులను ఆనందానికి గురిచేస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!