

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన తాజా చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఓ భావోద్వేగ ఘటనను పంచుకుంది. ‘గ్యాంగ్స్టర్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత తన తల్లిదండ్రులు సినిమా చూసి ఆశించిన విధంగా స్పందించలేదని తెలిపింది. ఆ సమయంలో సినీ పరిశ్రమపై కుటుంబానికి మంచి అభిప్రాయం లేకపోవడంతో, సినిమాలోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పింది.
ఆ సంఘటన తనను ఎంతో బాధపెట్టిందని, అప్పటి నుంచి తన సినిమాల గురించి కుటుంబ సభ్యుల అభిప్రాయాలను ఆశించకూడదని నిర్ణయించుకున్నట్లు కంగనా పేర్కొంది. అయితే ‘క్వీన్’ చిత్రంలో తన నటనకు అమితాబ్ బచ్చన్ నుంచి ప్రశంసల లేఖ రావడం తనకు ప్రత్యేక అనుభూతిని కలిగించిందని తెలిపింది. అనంతరం జాతీయ అవార్డులు అందుకున్న తర్వాతే తన తల్లిదండ్రులు గర్వపడటం ప్రారంభించారని, అదే వారి ఆలోచనలో పెద్ద మార్పుకు కారణమైందని వెల్లడించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!