
ఓటీటీ

మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా బయట కార్యక్రమాల్లో కూడా ఆయన తనదైన హాస్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. తాజాగా ‘మెగా158’ పూజా కార్యక్రమంలో అలాంటి సరదా సంఘటన చోటుచేసుకుంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పూజా అనంతరం పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్ కలిసి ఫొటో దిగుతున్న సమయంలో చిరంజీవిని కూడా మధ్యలోకి రావాలని కోరారు. దీనిపై చిరంజీవి సరదాగా స్పందిస్తూ “దేవుడు, భక్తుడు మధ్యలో నేనెందుకు? దేవుడికి భక్తుడికి మధ్య అంబికా దర్బార్ బత్తీలాంటి వాడిని నేను” అంటూ కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!