
జనరల్

రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ కోసం భారీ ప్రమోషన్ ప్లాన్ సిద్ధమైంది. ఈ నెల 18న ముంబైలో ప్రారంభమయ్యే పవర్ ప్లే టూర్ ద్వారా దేశంలోని కీలక నగరాల్లో ఈవెంట్లు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈవెంట్ టాలీవుడ్ చరిత్రలోనే అతిపెద్ద వేడుకగా నిలవనుందని సమాచారం.
ముంబైలో ట్రైలర్ లాంచ్తో ప్రారంభమయ్యే ఈ ప్రమోషన్స్ తర్వాత భోపాల్, బెంగళూరు, ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో వరుస ఈవెంట్లు జరగనున్నాయి. జూన్ 2న హైదరాబాద్లో బిగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనుండగా, జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్ షోలు, జూన్ 4న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ జరగనుంది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!