

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు థియేట్రికల్ ట్రైలర్ జనవరి 4న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్కు అద్భుతమైన స్పందన లభిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మీసాల పిల్ల 100 మిలియన్ వ్యూస్ దాటగా, శశిరేఖ 40 మిలియన్ వ్యూస్కు చేరువైంది. చిరంజీవి, వెంకటేష్లపై తెరకెక్కిన సంక్రాంతి అదిరిపోద్ది పాట పండుగ మూడ్ను తెచ్చే యాంతమ్గా మారింది.
ట్రైలర్ ద్వారా సినిమా ప్రధాన కథను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. కుటుంబ కథనానికి మాస్ ఎలిమెంట్స్, క్రైమ్ డ్రామా టచ్ జోడించామని దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే సంకేతాలిచ్చారు. నయనతార కథానాయికగా నటిస్తుండగా, క్యాథరిన్ ట్రెసా ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాహు గరపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అర్చనా సమర్పిస్తున్నారు. జనవరి 12, 2026న సంక్రాంతి స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుండగా, యూఎస్ఏ అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే లక్ష డాలర్లను దాటడం విశేషం.
.webp&w=3840&q=75)



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!