

లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘డిసి’ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ తెరకెక్కించిన ఈ వైలెంట్ యాక్షన్ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే సినిమా రన్టైమ్ను ప్రకటించినప్పటికీ, ఇటీవల సోషల్ మీడియాలో ఈ చిత్రం 3 గంటల నిడివితో ఉంటుందనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అభిమానుల్లో నెలకొన్న సందేహాలకు తెరదించేందుకు నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారిక ప్రకటన చేసింది.
‘డిసి’ సినిమా మొత్తం 2 గంటల 23 నిమిషాల నిడివితోనే థియేటర్లలోకి రానుందని మేకర్స్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న 3 గంటల రన్టైమ్ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ యాక్షన్ చిత్రాన్ని ఆగస్టు 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. లోకేష్ కనగరాజ్ నటుడిగా ఎలా మెప్పిస్తారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!