
జనరల్

సూర్య నటించిన ‘కరుప్పు’ సినిమా విడుదలైన తర్వాత అందులోని ఓ డైలాగ్ సంగీత దర్శకుడు ఇళయరాజాను ఉద్దేశించి ఉందన్న చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఈ వివాదంపై తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ స్పందిస్తూ, ఇళయరాజా మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు అసలు లేదని స్పష్టం చేసింది. ఆ డైలాగ్ వల్ల ఆయనకు అసౌకర్యం కలిగితే తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని పేర్కొంది.
అదే సమయంలో భవిష్యత్ వెర్షన్లలో మరియు తదుపరి విడుదలల్లో ఆ భాగాన్ని తొలగించేందుకు లేదా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. భారతీయ సంగీత రంగానికి ఇళయరాజా చేసిన సేవలు అపారమని, ఆయనపై తమకు ఎప్పటికీ గౌరవం ఉంటుందని నిర్మాణ సంస్థ తెలిపింది. ప్రస్తుతం ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తూ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!