

కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీమణులు బహిరంగ కార్యక్రమాల్లో జరుగుతున్న అనుచిత చిత్రీకరణపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా సప్తమి గౌడ ఈ అంశంపై స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంతార చిత్రంతో గుర్తింపు పొందిన ఆమె, తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా మహిళా కళాకారులను కళాకారులుగానే చూడాలని కోరారు. ఉద్దేశపూర్వకంగా జూమ్ చేసి అవమానకర కోణాల్లో చిత్రీకరించడం పూర్తిగా అనైతికమని పేర్కొన్నారు. “మేము మా పనికోసం ఇక్కడ ఉన్నాం. అనవసరంగా జూమ్ చేసి చిత్రీకరించడం మా గౌరవాన్ని ఉల్లంఘించడమే” అంటూ భావోద్వేగంగా స్పందించారు.
సప్తమి గౌడ అభిప్రాయానికి రుక్మిణి వసంత్, ఆషిక రంగనాథ్ మద్దతు తెలిపారు. బహిరంగ కార్యక్రమాల్లో మహిళా నటుల ఫోటోలు, వీడియోలను అసభ్యకర కోణాల్లో చిత్రీకరించడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదని వారు స్పష్టం చేశారు. మీడియా మరియు డిజిటల్ కంటెంట్ సృష్టికర్తలు కళాకారిణుల వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. సోషల్ మీడియా విస్తరణతో అభిమానుల మద్దతు పెరిగినప్పటికీ, పాపరాజీ సంస్కృతి కారణంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సప్తమి ప్రారంభించిన ఈ ఉద్యమానికి కన్నడ చిత్రసీమలోని పలువురు ప్రముఖులు మద్దతుగా నిలవడం గమనార్హం.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!