

బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘కాలా హిరణ్: ది బ్యాటిల్ ఫర్ లెగసీ’ చిత్రం కొత్త వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఈ సినిమా కథ, ప్రచార సామగ్రి గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కృష్ణజింకల వేట కేసును పోలి ఉన్నాయని భావిస్తూ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. సినిమా పోస్టర్లు, టీజర్ కంటెంట్ తనను పరోక్షంగా సూచించేలా ఉన్నాయని, ఇది ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలను కలిగించే అవకాశం ఉందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించినట్లు తెలుస్తోంది.
సినిమా నిర్మాణం, ప్రచారం, విడుదలపై తక్షణ స్టే విధించాలని సల్మాన్ ఖాన్ కోర్టును కోరినట్లు సమాచారం. మరోవైపు చిత్ర బృందం మాత్రం తమ ప్రాజెక్ట్ను సమర్థిస్తూ ముందుకు సాగుతోంది. నిర్మాత అమిత్ జానీ నిర్మిస్తున్న ఈ చిత్రం కృష్ణజింకల కేసుతో పాటు మరికొన్ని వివాదాస్పద అంశాలను ప్రస్తావిస్తుందనే ప్రచారం కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టు విచారణ జరపనుండగా, కోర్టు తీర్పు సినిమా భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశముంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!