

పుష్ప సినిమాతో ఎలాంటి సంబంధం? ఎందుకు పోలికలు వస్తున్నాయి? అని అనుకుంటున్నారా? విషయం చదివితే మీకే అర్థమవుతుంది.
మహేష్ బాబు వారణాసిలో విలన్ కుంభగా నటిస్తున్న పృథ్విరాజ్ సుకుమారన్ హీరోగా చేసిన కొత్త సినిమా “విలయత్ బుద్దా” ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళంతో పాటు తెలుగు ట్రైలర్ కూడా విడుదలైంది.
అయితే ట్విస్ట్ ఏంటంటే… ట్రైలర్ చూసిన ప్రేక్షకుల్లో చాలామందికి ఇది పుష్ప సినిమాను గుర్తు చేస్తోంది.
అడవులు, ఎర్ర చందనం స్మగ్లింగ్, పోలీసులను మోసగించే ప్లాన్లు — ఇవన్నీ పుష్ప వైబ్ను తీసుకొచ్చాయని నెట్లో కామెంట్లు వస్తున్నాయి. అందుకే ప్రమోషన్లలో ఎక్కడికి వెళ్లినా పృథ్విరాజ్ను ఇదే ప్రశ్న వేధిస్తోంది.
దీనిపై ఆయన క్లారిటీ ఇస్తూ అన్నారు:
పుష్ప రాక ముందే విలయత్ బుద్దాను ప్లాన్ చేశాం.
ఈ సినిమా ప్రసిద్ధ రచయిత జి.ఆర్. ఇందు గోపాలన్ రాసిన నవల ఆధారంగా రూపొందుతోంది.
‘అయ్యప్పనుం కోశియుమ్’ దర్శకుడు సాచి ఈ ప్రాజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు కానీ 2020లో ఆయన ఆకస్మిక మరణంతో బాధ్యతలను ఆయన అసిస్టెంట్ జయన్ నంబియార్ తీసుకున్నారు.
పుష్పలో ఇదే బ్యాక్డ్రాప్ ఉందన్న విషయం అప్పుడు తమ టీమ్కు తెలియదని చెప్పారు.
షెడ్యూల్ ఆలస్యాల కారణంగా సినిమా 2025కి వచ్చేసిందని వివరించారు.
కథ పరంగా పోలికలు ఏవీ ఉండవని, తాను చేసిన డబుల్ మీనన్ పాత్రకి పుష్పరాజ్తో ఎలాంటి సారూప్యత లేదని పృథ్విరాజ్ స్పష్టం చేస్తున్నారు.
నిజానికి విలయత్ బుద్దా కథ హీరో–పోలీస్ ఆఫీసర్ మధ్య ఈగో క్లాష్ కాదు. ఇది ఒక్కటే వేరే సెటప్లో సాగుతుంది.
కానీ అడవులు, దుంగలు వంటి కొన్ని విజువల్ ఎలిమెంట్స్ కొద్దిగా సేమ్గా అనిపించవచ్చు.
పృథ్విరాజ్ చెప్పినట్టే నిజంగా పోలికలు లేకపోతే సమస్య ఏమీ లేదు.
కాని కొంతైనా సారూప్యత కనిపిస్తే… అదే అసలు డిబేట్ మొదలవుతుంది.
ఎట్టకేలకు కంటెంట్ బాగుంటే ఆడియన్స్ హిట్ చేస్తారనేది నిజం!











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!