

గత కొన్ని రోజులుగా టాలీవుడ్లో ప్రధాన చర్చ ఐబొమ్మ రవి అరెస్ట్ గురించే. అరెస్టైన వెంటనే రవి తండ్రి అప్పారావు తన కుమారుడి అక్రమ క్రియాకలాపాల గురించి తనకి అసలు తెలియదని, బయటపడిన విషయాలపై షాక్కు గురయ్యానని చెప్పారు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మరియు చిత్ర పరిశ్రమను బహిరంగంగా సవాలు చేయడం రవి చేసిన పెద్ద తప్పు అని అంగీకరించారు.
కానీ, ఆ వ్యాఖ్యలు చేసిన కొద్దిరోజులకే అప్పారావు పూర్తిగా మాట మార్చేశారు. తన కుమారుడి చర్యలను సమర్థిస్తూ, పెరిగిన టికెట్ రేట్ల కారణంగానే ప్రజలు థియేటర్స్కు రావడం లేదని వాదించారు. నిర్మాత సి.కళ్యాణ్ ను కూడా విమర్శిస్తూ, రవి లాంటి వారిని ఎంకౌంటర్ చేయాలని చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
“సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్కి వస్తారు. నేను 45 పైసలు ఖర్చు చేసి సినిమాలు చూసేవాడిని. ఇప్పుడు టికెట్ రేట్లు ఆకాశాన్నంటాయి. నిర్మాతల్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని ఎవరు అన్నారు? సరసమైన రేట్లకు టికెట్లు ఇవ్వలేరా? నా కుమారుడి తరఫున వాదిస్తున్న లాయర్లకు నేను ఆర్థికంగా సహాయపడతాను” అంటూ అప్పారావు అన్నారు. అప్పారావు చేసిన ఈ సంచలన యూటర్న్ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!