

అంగరంగ వైభవంగా, మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో నిన్న రాత్రి శ్రీ శ్రీనివాస కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ నాయకులు మరియు సినీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు, వారిలో బండి సంజయ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రఘురామకృష్ణం రాజు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, అరికపూడి గాంధీ, ఏలూరి సాంబశివరావు, శివసేనా రెడ్డి ఉన్నారు. చిత్ర పరిశ్రమ నుండి విజయేంద్ర ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్, అనన్య నాగెల్లా, ఆకాష్ పూరి, శివ బాలాజీ మరియు మధుమిత, రాకింగ్ రాకేష్ మరియు జోర్దార్ సుజాత, దామోదర్ ప్రసాద్, మానస వారణాసి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో భాగమై భక్తి పరవశంలో మునిగిపోయారు.
ఈ సందర్భంగా మహా న్యూస్ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ మాట్లాడుతూ, ఈ శ్రీ శ్రీనివాస కళ్యాణం నిర్వహించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, ఇరు తెలుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు సుఖ శాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని ఇది ముఖ్య కారణమని చెప్పారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారి క్షేమం కోరుకునే వ్యక్తినని ఆయన అన్నారు. కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మరియు ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు, వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తిరుపతి నుండి స్వామివారిని తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన టీటీడీ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, సుదర్శన్ దీక్షితులు, గోవిందరాజు, వేద పండితులు మరియు ఇతర సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!