

శివాజీ, లయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. బన్నీ వాస్, వంశీ నందిపాటి నిర్మాణంలో ఈటీవీ విన్తో కలిసి రూపొందిన ఈ చిత్రం ఈ నెల 6 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ సినిమా పండగ వాతావరణంలో నవ్వులు పంచుతుందని విశ్వాసం వ్యక్తం చేయగా, బండ్ల గణేష్ థియేటర్ రిలీజ్ నిర్ణయాన్ని అభినందించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించేందుకు మేకర్స్ ప్రత్యేక ఫ్యామిలీ టికెట్ కాంబోను ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్లో రూ.499 కు నాలుగు టికెట్లు మరియు ఒక పాప్కార్న్, మల్టీప్లెక్స్లలో రూ.699 కు నాలుగు టికెట్లు మరియు ఒక బిగ్ పాప్కార్న్ అందించనున్నారు. ఈ సినిమా పూర్తి స్థాయి కుటుంబ వినోదాన్ని అందిస్తుందని హీరో శివాజీ పేర్కొనగా, ప్రేక్షకుల అంచనాలను మించేలా చిత్రం ఉంటుందని నటి లయ విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని వయస్సుల ప్రేక్షకులను అలరించే నవ్వుల పండుగగా ఈ చిత్రం నిలుస్తుందని చిత్ర బృందం భావిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!