

టాలీవుడ్ అగ్ర నటి సమంత రూత్ ప్రభు నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్లో నిర్వహించిన ట్రైలర్ విడుదల కార్యక్రమంలో సమంతతో పాటు ఆమె భర్త రాజ్ నిడిమోర్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో అభిమానుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఓ అభిమాని ఒక్కసారిగా స్టేజ్పైకి వెళ్లి సమంతకు పూల గుచ్ఛం అందించాడు. అనంతరం మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేసినట్లుగా తన అభిమానాన్ని వ్యక్తం చేశాడు. తర్వాత సమంతతో సెల్ఫీ కూడా దిగాడు. ఈ ఘటన జరుగుతున్నంతసేపు రాజ్ నిడిమోర్ ప్రశాంతంగా వ్యవహరించగా, సమంత కూడా చిరునవ్వుతో స్పందించి అభిమానిని పంపించింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా, సంగీతాన్ని సంతోష్ నారాయణన్ అందిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!