
న్యూస్

రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘దురంధర్’కు కొనసాగింపుగా వచ్చిన ‘దురంధర్-2’ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలో ప్రదర్శించబడాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్ను విడుదల చేయడం విశేషంగా మారింది.
సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ఈ చిత్రాన్ని మాస్టర్ పీస్గా అభివర్ణించగా, ఇంటర్వెల్ సీక్వెన్స్ అద్భుతంగా ఉందని కామెంట్లు వస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ బ్లాక్బస్టర్ అని, ఈ సినిమా భారీ విజయాన్ని సాధించే అవకాశముందని ట్విటర్లో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!