
సినిమాలు

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా మాస్ యాక్షన్ చిత్రం ధర్మన్ శరవేగంగా తెరకెక్కుతోంది. యువ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రెండు షూటింగ్ షెడ్యూళ్లను పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రస్తుతం మూడో షెడ్యూల్లోకి అడుగుపెట్టింది. దీంతో సినిమాపై అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
షూటింగ్ అనుకున్న దానికంటే వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ధర్మన్ సంక్రాంతి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది. అదే నిజమైతే తక్కువ వ్యవధిలోనే రజినీకాంత్ నుంచి వరుసగా సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా, లెజెండరీ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!