

టీమిండియా స్టార్ క్రికెటర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్పై చేసిన వ్యాఖ్యల వివాదంపై నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఖుషీ ముఖర్జీ తొలిసారిగా స్పందించారు. సూర్యకుమార్ తనపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారంటూ ప్రచారం జరుగుతున్న వార్తలను ఆమె పూర్తిగా ఖండించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి అనవసరంగా పెద్ద వివాదంగా మార్చారని, తనకు ఇప్పటివరకు ఎలాంటి లీగల్ నోటీసు అందలేదని ఖుషీ స్పష్టం చేశారు. తన మాటల్లో దురుద్దేశం లేదని, గతంలో పరిచయం ఉందని మాత్రమే చెప్పానని వివరించారు.
ఈ వ్యవహారాన్ని మీడియా అతిగా చూపుతోందని ఖుషీ ఆరోపించారు. చిన్న విషయాన్ని పెద్ద ఆరోపణలుగా మార్చి ప్రచారం చేస్తున్నారని, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం పబ్లిసిటీ కోసమే ఈ వివాదంలోకి వచ్చారని ఆమె అన్నారు. తాను ఎలాంటి చట్టపరమైన తప్పు చేయలేదని, ఇది పూర్తిగా అనవసరంగా సృష్టించిన వివాదమని స్పష్టం చేశారు. తన పరువు లేదా సూర్యకుమార్ పరువుకు తాను ఎక్కడా భంగం కలిగించలేదని ఖుషీ తేల్చి చెప్పారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!