

మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ నటిస్తున్న ‘అతిమనోహరం’ చిత్రానికి అనూహ్యమైన అడ్డంకి ఎదురైంది. తరుణ్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మీరా జాస్మిన్ కథానాయికగా నటిస్తుండగా, లాలూ అలెక్స్, మనోజ్ కె. జయన్, జగదీష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను శబరిమలలో చిత్రీకరించేందుకు మేకర్స్ ప్రణాళిక రూపొందించారు. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు నాడపంతల్ వరకు కొన్ని షరతులతో అనుమతులు ఇచ్చినప్పటికీ, అటవీ శాఖ నుంచి తుది అనుమతి లభించకపోవడంతో శబరిమల సన్నిధానంలో జరగాల్సిన షూటింగ్ షెడ్యూల్ రద్దయింది.
ఈ పరిణామంపై కేరళ మంత్రి మురళీధరన్ స్పందిస్తూ.. శబరిమల ప్రాంగణంలో స్వామి అయ్యప్పకు సంబంధించిన భక్తి చిత్రాలు లేదా మతపరమైన ప్రాధాన్యత ఉన్న సినిమాల షూటింగ్లకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సాధారణ కమర్షియల్ సినిమాల చిత్రీకరణకు అనుమతించబోమని పేర్కొన్నారు. దేవస్వం బోర్డు నుంచి అనుమతి ఉన్నప్పటికీ అటవీ శాఖ క్లియరెన్స్, మంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో మోహన్లాల్ సినిమా షూటింగ్ నిలిచిపోవడం ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!