

బాలీవుడ్ నటి అనన్య పాండే వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో తన తదుపరి ప్రాజెక్టుల ఎంపికలో ఆమె మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ముంబైలో జరిగిన ‘బ్యూటీవర్స్’ ఫ్యాషన్ ఈవెంట్లో పాల్గొన్న అనన్య, అందం, గ్లామర్ మరియు సెలబ్రిటీలపై సమాజం చేసే వ్యాఖ్యల గురించి ఆసక్తికరంగా స్పందించారు.
ప్రజలు ఎప్పుడూ నటీనటుల రూపురేఖలను అంచనా వేస్తూనే ఉంటారని పేర్కొన్న ఆమె, తన సహజ స్వరూపాన్ని కూడా అభిమానులతో పంచుకోవడం ఇష్టమని చెప్పారు. పెద్ద ఈవెంట్లలో గ్లామరస్గా కనిపించినా, సాధారణ జీవితంలో తాను ఎంతో సాధారణంగా ఉంటానని వెల్లడించారు. అలాగే థియేటర్లలో సినిమా చూసే అనుభూతికి ఎలాంటి ప్రత్యామ్నాయం లేదని పేర్కొంటూ, ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్లకు వెళ్లి సినిమాలను ఆస్వాదించాలని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!