

ఈ మధ్యకాలంలో యువత నడివయసులోనే ఆకస్మిక మరణాలు ఎక్కువవుతున్నాయి. మొదటగా ఎక్కువగా కరోనా వల్లనే చనిపోతున్నారని భావించబడింది, కానీ ఢిల్లీలోని AIIMS చేసిన అధ్యయనంలో వాస్తవాలు బయటపడ్డాయి. 2018 నుంచి 2022 మధ్య 3,800 కి పైగా అకాల మరణాలను పరిశీలించిన ఈ అధ్యయనంలో 45 ఏళ్లలోపు చనిపోతున్నవారిలో దాదాపు సగం గుండె సంబంధిత సమస్యల కారణం అని తేలింది. గుండె వ్యాధులు 42.6%, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు 21.5%, ఇతర కారణాలు 35.9% అని రిపోర్ట్ తెలిపింది. కాబట్టి, కోవిడ్ అసలు కారణం కాదు అని వైద్యులు స్పష్టంగా చెప్పారు.
వైద్యుల ప్రకారం, యువతలో గుండె సమస్యలు పెరుగుతున్న ప్రధాన కారణం మారుతున్న జీవనశైలి. సిగరెట్, మద్యం, స్ట్రెస్, నిద్రలేమి, జంక్ ఫుడ్, వ్యాయామం వదిలివేయడం వంటి అలవాట్లు యువతను ప్రమాదంలోకి తీసుకువస్తున్నాయి. AIIMS పరిశోధనలో 2018 – 2022 మధ్య చనిపోయిన యువతలో 57% మంది ధూమపానం, 52% మంది ఆల్కహాల్ వాడకం చేసినవారని తేలింది. వైద్యులు చిన్న చిన్న లక్షణాలను తేలికగా తీసుకోకూడదని, 30 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కార్డియాక్ స్క్రీనింగ్ చేయించుకోవాలని, ఛాతీలో నొప్పి లేదా శ్వాస సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. జీవితశైలిని మార్చి, వ్యాయామం, సరైన ఆహారం, ఒత్తిడిని తగ్గించడం వంటి చర్యలతో గుండెను రక్షించుకోవాలని వైద్యులు హెచ్చరించారు.
గమనిక : మేము అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎటువంటి బాధ్యత వహించము. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని, న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!