

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఒక్కో ప్రాజెక్ట్తో ఒక్కో కొత్త జానర్ను టచ్ చేస్తూ తన మార్కెట్ను దేశ సరిహద్దులు దాటి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలోనే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కథ ఇదేనంటూ తాజాగా ఓ బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వినిపిస్తున్న సమాచారం ప్రకారం, స్పిరిట్ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పవర్ఫుల్, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్యారెక్టర్ చాలా గంభీరంగా, భావోద్వేగాలతో నిండిన పాత్రగా ఉంటుందని అంటున్నారు. కథ మొత్తం దేశ భద్రతకు సంబంధించిన పెద్ద సమస్య చుట్టూ తిరుగుతుందని టాక్. దేశాన్ని కాపాడేందుకు ప్రభాస్ చేసే పోరాటం, విలన్లతో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్బంప్స్ ఇస్తాయని అంటున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్గా త్రిప్తి దిమ్రి నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్, కాజోల్ వంటి వారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్టు సమాచారం. ఇక షూటింగ్ విషయానికి వస్తే, 2025 నవంబర్లో గ్రాండ్ ముహూర్తంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా, త్వరలో మెక్సికోలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. స్పిరిట్ సినిమా 2026 చివర్లో లేదా 2027లో విడుదల కానుందని తెలుస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం 'స్పిరిట్' కోసం ఇప్పటికే కౌంట్డౌన్ మొదలుపెట్టేశారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!