

డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారన్న వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. మొదటగా రజినీకాంత్ – కమల్ హాసన్ మల్టీస్టారర్ను లోకేష్ తెరకెక్కిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయి, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ను ప్రస్తుతం #AA23 అనే వర్కింగ్ టైటిల్తో రూపొందించనున్నారు.
ఈ సినిమానే లోకేష్ కనగరాజ్ ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఇరుంబుకై మాయావి’ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన లోకేష్, “ఇప్పటికి మేము ప్రాజెక్ట్ను ప్రకటించాం అంతే. పూర్తి వివరాలు నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడిస్తుంది. ప్రస్తుతం ఒక సినిమాపై పని చేస్తున్నాం” అని క్లారిటీ ఇవ్వకుండా సమాధానం దాటవేశారు.
లోకేష్ ఈ వార్తలను ఖండించకపోవడంతో, అల్లు అర్జున్ అభిమానులు ఇది నిజంగానే ‘ఇరుంబుకై మాయావి’ అని నమ్ముతున్నారు. అయితే, ఈ కథను గతంలో సూర్య కోసం రాసానని లోకేష్ చెప్పడంతో, ఇప్పుడు అదే కథ బన్నీకి వెళ్లిందా అనే సందేహం సూర్య అభిమానుల్లో కనిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్పై పూర్తి స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!