

టాలీవుడ్ సెలబ్రిటీలు కేవలం ప్రొఫెషనల్ పనులతోనే కాకుండా తమ వ్యక్తిగత జీవితంపైనా దృష్టి పెడుతున్నారు. జీవితంలో కొత్త అడుగు వేయడానికి, పెళ్లి బంధంలోకి అడుగుపెట్టడానికి చాలామంది ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, అల్లు శిరీష్ పెళ్లి చేసుకుని సెటిలయ్యారు. అటు బెల్లంకొండ శ్రీనివాస్ తనకు కాబోయే భార్యను పరిచయం చేశాడు.
ఇప్పుడు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి కుమారుడు, గాయకుడు కాల భైరవ కూడా ఈ జాబితాలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. బలగం హీరోయిన్ కావ్య కల్యాణ్రామ్తో అతడు ప్రేమలో ఉన్నాడనే వార్తలు కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీసింహ హీరోగా నటించిన ఉస్తాద్ సినిమా సమయంలో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి, అదే క్రమంలో ప్రేమగా మారిందని అంటున్నారు. సినిమా సెట్లో మొదలైన ఈ పరిచయం తర్వాత ఇద్దరి మధ్య బంధం మరింత బలపడిందని సమాచారం. కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రేమకు అంగీకారం తెలిపారని, త్వరలోనే పెళ్లి జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక కార్యక్రమానికి కావ్య, కాల భైరవ కలిసి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తమ ప్రేమను పరోక్షంగా వెల్లడించారని నెటిజన్లు భావిస్తున్నారు.
కావ్య కల్యాణ్రామ్ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతానికి చెందినది. ఆమె గంగోత్రి సినిమాలో బాలనటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, బాలు, బన్నీ, పాండురంగడు వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించింది. 2022 లో వచ్చిన మసూద సినిమాతో హీరోయిన్గా మారి, బలగం సినిమాతో మంచి గుర్తింపు పొందింది. కాల భైరవ 2019 లో వచ్చిన మత్తు వదలరా సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. కలర్ ఫోటో, ఆకాశవాణి, లక్ష్య, కార్తికేయ 2, గుర్తుందా శీతాకాలం, మోగ్లీ, మత్తు వదలరా 2, యుఫోరియా వంటి చిత్రాలకు సంగీతం అందించాడు. అలాగే బాహుబలి 2లో పాడిన “దండాలయ్యా” పాటతో గాయకుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్తో కలిసి పాడిన “నాటు నాటు” పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. అదే సినిమాలోని “కొమురం భీముడో” పాటకు కాల భైరవ జాతీయ అవార్డు అందుకున్నాడు.








.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!