

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది అక్టోబర్ వరకు సాగుతుందని సమాచారం. అందువల్ల ఈ చిత్రం వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా సంగతి పక్కన పెడితే, బన్నీ నెక్స్ట్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడన్న ఆసక్తి మాత్రం ఇంకా కొనసాగుతోంది.
ఇటీవల అల్లు అర్జున్ మళ్లీ త్రివిక్రమ్తో పని చేయబోతున్నాడన్న వార్తలు వచ్చాయి. గతంలో అల్లు అర్జున్ దగ్గర నుంచి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన గాడ్ ఆఫ్ వార్ స్క్రిప్ట్ తిరిగి అల్లు అర్జున్ వద్దకు వచ్చిందన్న టాక్ కూడా వినిపించింది. అయితే దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇదే సమయంలో ఇప్పుడు కొత్తగా లోకేశ్ కనగరాజ్ పేరు బలంగా వినిపిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో అల్లు అర్జున్–లోకేశ్ కనగరాజ్ కలిసి ఓ సినిమా చేయబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. లోకేశ్ గతంలో రాసుకున్న ఇరుంబక్కు మాయావీ కథను ప్రస్తుతం యువతకు నచ్చేలా మార్చి బన్నీతో చేయాలనుకుంటున్నారని సమాచారం. ఈ కథను గతంలో సూర్యతో, తరువాత ఆమిర్ ఖాన్తో అనుకున్నారు కానీ కుదరలేదు. ప్రమాదంలో చేయి కోల్పోయిన ఓ వ్యక్తికి లోహంతో చేసిన చేయి అమర్చడం, ఆ తర్వాత అతని జీవితంలో జరిగే మార్పులే ఈ కథ సారాంశం. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించే అవకాశముందని కూడా టాక్ ఉంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!