

రాకింగ్ స్టార్ యష్ నటించిన తాజా చిత్రం టాక్సిక్ వచ్చే నెల 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్లు సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి. ఈ సినిమా టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్రాజుకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ను ఆయన భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి.
ఈ చిత్రానికి గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ మరియు మోన్స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై వెంకట్ కె నారాయణ మరియు యష్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. యష్ సరసన రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో అక్షయ్ ఒబెరాయ్, టోవినో థామస్ తదితరులు కనిపించనున్నారు. సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. అదే రోజు రణ్వీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 విడుదల కావడంతో బాక్సాఫీస్ పోటీపై చర్చ నడుస్తోంది.
ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోందని సమాచారం. ఓవర్సీస్ రైట్స్ను పార్స్ ఫిలింస్ భారీ మొత్తానికి దక్కించుకోగా, తెలుగు రాష్ట్రాల రైట్స్ను దిల్రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కొనుగోలు చేసినట్లు ట్రేడ్ టాక్. ఈ రిస్క్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. సినిమా ప్రమోషన్స్ను భారీగా నిర్వహించేందుకు దిల్రాజు ప్లాన్ చేస్తున్నారని, హైదరాబాద్లో మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్కు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరో ఒకరిని ఆహ్వానించే ఆలోచనలో ఉన్నారని ఫిలింనగర్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో త్వరలో స్పష్టత రానుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!