

చండీగఢ్కు చెందిన యువ ఇంటర్నల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ ప్రబ్లీన్ కౌర్ ప్రైవేట్ ఆస్పత్రిలో విధుల్లో చేరిన తొలిరోజే రాజీనామా చేసినట్లు సమాచారం. అవసరం లేకపోయినా కొంతమంది రోగులను ఆస్పత్రిలో చేర్చడం, వైద్యపరంగా అవసరం లేని సమయంలోనూ కొందరిని ఐసీయూలో కొనసాగించడం జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాలను వివరిస్తూ ఆమె చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తాను అనైతికంగా భావించిన నిర్ణయాలకు తన వృత్తిపరమైన పేరు ముడిపెట్టడం ఇష్టం లేకే రాజీనామా చేసినట్లు డాక్టర్ ప్రబ్లీన్ కౌర్ తెలిపారు. జీతం లేదా పదవి కంటే రోగుల భద్రత, వైద్య నైతికతకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియోతో ప్రైవేట్ వైద్యరంగంలో వాణిజ్యీకరణ, రోగుల భద్రత, వైద్య నైతికతపై చర్చ మొదలైంది. అయితే ఈ ఆరోపణలు వైద్యురాలి వైరల్ వీడియో ఆధారంగానే ఉన్నాయి, స్వతంత్రంగా ధృవీకరించబడలేదు. ఆస్పత్రి వర్గాల స్పందన కూడా అందుబాటులోకి రాలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!