

ప్రశ్నపత్రాల లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఆయన అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. పేపర్ లీక్లు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు రూపొందిస్తున్న ముసాయిదా బిల్లుపై మంత్రులు చర్చించారు. నేరాలకు మరింత కఠిన జైలు శిక్షలు, భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే అంశాలు ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం. మంత్రుల సూచనలతో ముసాయిదా బిల్లుకు తుదిరూపం ఇవ్వనున్నారు.
ప్రస్తుతం అమల్లో ఉన్న 2024 ప్రజా పరీక్షలు (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి సవరణలు చేస్తూ కొత్త బిల్లును తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. వచ్చే సోమవారం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు, నీట్ వివాదం, విద్యావ్యవస్థలో సంస్కరణలపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో కేంద్రమంత్రులు ఢిల్లీలో చర్చలు జరిపారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పునరుద్ఘాటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!