
రాజకీయాలు

ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో గురువారం సాయంత్రం ‘ఆశీర్వాద్ కా దియా’ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షిప్రా నది తీరంలోని ఘాట్లు, మహాకాళ్ లోక్ ప్రాంతంలో ఒకేసారి 33.27 లక్షల ప్రమిదలను వెలిగించారు. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించినట్లు అధికారులు తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సాయంత్రం సైరన్ మోగిన అనంతరం దీపాలను ఒకేసారి వెలిగించారు. 25 వేలకు పైగా వాలంటీర్లు, భక్తులు, ప్రజలు ఇందులో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమిదలతో ప్రధాని మోదీ చిత్రాన్ని కూడా రూపొందించారు. మధ్యప్రదేశ్ వ్యాప్తంగా మొత్తం 3.55 కోట్ల ప్రమిదలను ఏకకాలంలో వెలిగించినట్లు అధికారులు వెల్లడించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!