
జనరల్

బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో ఉన్న ఆర్మీ శిబిరంలో గ్రనేడ్ పేలి ఇద్దరు సైనికులు మృతి చెందారు. కమల్కోట్ శిబిరంలో సైనికులు పరికరాలు అప్పగిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ గ్రనేడ్ పేలినట్లు సమాచారం.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను వెంటనే ఆర్మీ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతుల వివరాలు, వారు ఏ రాష్ట్రానికి చెందినవారో ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!