

బీఆర్ఎస్ పార్టీ మరోసారి సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించింది. సభ్యత్వ నమోదు నుంచి కమిటీల ఏర్పాటు వరకు నిజమైన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీలు, నియోజకవర్గ స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ డిజిటల్ విధానంలో సభ్యత్వ నమోదు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు ఇంచార్జీలను ఇప్పటికే నియమించిన పార్టీ, ప్రతి బూతుకు ఇద్దరు కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత నిరుత్సాహానికి గురైన శ్రేణుల్లో మళ్లీ నమ్మకం పెంచేందుకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు చేపడుతున్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పార్టీని మరింత బలోపేతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అయితే సీనియర్ నేతల మధ్య సమన్వయం లేకపోతే మళ్లీ పాత పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజల మద్దతు కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!