

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేవరపల్లి పర్యటన సందర్భంగా హెలిప్యాడ్, పొగాకు వేలం కేంద్రం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు హెలిప్యాడ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా బారికేడ్లు విరిగి తోపులాట చోటు చేసుకున్నట్లు సమాచారం. అలాగే కొందరు కార్యకర్తలు అతివేగంగా బైకులు నడపడం, సైలెన్సర్లు తొలగించి భారీ శబ్దాలు చేయడం, రోడ్డుపై స్టంట్లు చేయడం వల్ల స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సమాచారం. దేవరపల్లి బస్టాండ్ వద్ద ట్రాఫిక్ కూడా కొంతసేపు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది.
మరోవైపు పొగాకు వేలం కేంద్రం వద్ద పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. హెలిప్యాడ్ వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతోనే కార్యకర్తలు హెలికాప్టర్ సమీపానికి చేరుకున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. సభకు వచ్చిన ప్రజలను పోలీసులు బారికేడ్లతో అడ్డుకోవడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని పార్టీ పేర్కొంది. ఈ ఘటనలపై అధికారుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!