

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, ఆలయ ఛైర్మన్ సురేంద్రబాబు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి, ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవాల విశిష్టతను, ఏర్పాట్లను సీఎంకు వివరించినట్లు సమాచారం.
సీఎంను కలిసిన సందర్భంగా ఆలయ పండితులు వేదాశీర్వచనం అందించి, శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను సమర్పించారు. ఆధ్యాత్మిక వైభవంతో జరిగే కాణిపాకం బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి అక్టోబర్ 4 వరకు జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కావాలని ఆలయ కమిటీ అధికారికంగా ఆహ్వానించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!