

చెన్నైలో ప్రపంచ ప్రమాణాలతో కూడిన తమిళనాడు ఒలింపిక్ సిటీని నిర్మించనున్నట్లు సీఎం విజయ్ ప్రకటించారు. తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయనున్న ఈ ప్రాజెక్టులో అంతర్జాతీయ స్థాయి క్రీడా మైదానాలు, అత్యాధునిక క్రీడా పరికరాలు, ఉన్నత స్థాయి శిక్షణా కేంద్రాలు, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడికల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కోచ్లు, క్రీడాకారులకు అవసరమైన వసతి, ఆధునిక మౌలిక సదుపాయాలను కూడా కల్పించనున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు అథ్లెట్లను ఒలింపిక్స్లో అత్యధిక పతకాలు సాధించేలా తీర్చిదిద్దేందుకు నాణ్యమైన శిక్షణతో పాటు అన్ని రకాల సదుపాయాలు అందిస్తామని సీఎం విజయ్ వెల్లడించారు.
అదే సమయంలో చెన్నైలో మోటార్ స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేసి, ఫార్ములా రేసింగ్తో పాటు ఇతర అంతర్జాతీయ స్థాయి మోటార్ స్పోర్ట్స్ పోటీలను నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మోటార్ స్పోర్ట్స్పై ఆసక్తి, ప్రతిభ ఉన్న యువతను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు ప్రత్యేక వాహనాల తయారీ పరిశ్రమలు కూడా ఏర్పడి యువతకు ఉద్యోగావకాశాలు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. 2028 చివరి నాటికి ఫార్ములా 1 రేసింగ్ను భారత్కు తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర క్రీడా శాఖ చర్యలు చేపడుతోందని, ఇందుకోసం జూన్లో ప్రత్యేక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసినట్లు కూడా వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!