

రేవంత్ రెడ్డి నేడు గుర్రంగూడ ఎకో పార్కులో వనమహోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్రంలో హరితవనం విస్తరణ లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నాగలింగం మొక్కను నాటనుండగా, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ నేరేడు మొక్కను నాటనున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 16.06 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ మహత్తర కార్యక్రమం కోసం రాష్ట్రంలోని 13,242 నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేశారు. అలాగే గుర్రంగూడ ఎకో పార్కులో రూ.17.84 కోట్ల అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా రూ.35.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి విస్తృత స్థాయిలో స్పందన లభించే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!