

పేద కుటుంబాల పిల్లల విద్యకు ప్రోత్సాహం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద అర్హులైన ప్రతి విద్యార్థికి ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. ఎన్నికల హామీ మేరకు కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న ప్రతి అర్హ విద్యార్థికి రూ.15 వేల మంజూరు చేస్తుండగా, అందులో రూ.2 వేలను పాఠశాల అభివృద్ధి నిధికి కేటాయించి, మిగిలిన రూ.13 వేలను తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే అర్హులందరికీ ఈ పథకం వర్తిస్తుంది.
అర్హుల జాబితాలను ఇప్పటికే స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాలకు పంపించగా, జాబితాలో పేర్లు లేని అర్హులకూ ఆగస్టు నెలాఖరులోగా లబ్ధి అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. బాపట్ల జిల్లాలో 1,44,271 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.187.55 కోట్లు, పల్నాడు జిల్లాలో 2,83,084 మంది విద్యార్థులకు సంబంధించి రూ.368 కోట్లు తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు. బుధవారం నుంచి నగదు జమ ప్రక్రియ ప్రారంభం కానుంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!