

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మరింత విస్తరించాయి. జూన్ 23, 2026 నాటికి మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, మహారాష్ట్రలోని ముంబై సహా పలు ప్రాంతాలు, తెలంగాణ మరియు ఒడిశాలోని మిగిలిన భాగాలు, అలాగే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నాయి. ప్రస్తుతం రుతుపవనాల ఉత్తర సరిహద్దు దహాను, వర్ధా, రాయ్పూర్, దాల్తోంగంజ్, మోతిహారి ప్రాంతాల మీదుగా విస్తరించి ఉంది.
భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం, రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశముంది. అనంతరం జార్ఖండ్, బీహార్లోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు కూడా నైరుతి రుతుపవనాలు చేరుకుని విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!