
జనరల్

బీహార్లోని ససారం రైల్వే స్టేషన్లో పాట్నాకు వెళ్తున్న ప్యాసింజర్ రైలు బోగీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలు బయలుదేరే కొద్ది నిమిషాల ముందు మంటలు చెలరేగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక రోజు ముందే మధ్యప్రదేశ్లో రాజధాని ఎక్స్ప్రెస్లో కూడా ఇలాంటి అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం రైల్వే భద్రతపై ఆందోళనలను పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!