
రాజకీయాలు

నటి ట్విషా శర్మ మృతదేహానికి భోపాల్లో రెండోసారి పోస్ట్మార్టం నిర్వహించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఢిల్లీ ఎయిమ్స్కు చెందిన నిపుణుల బృందం మరోసారి శవ పరీక్ష చేపట్టింది. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా, భోపాల్లో అంత్యక్రియలు నిర్వహించారు. ట్విషా మరణంపై అనుమానాలు ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు మొదటి నుంచే ఆరోపిస్తున్నారు.
నోయిడాకు చెందిన ట్విషా శర్మ మే 12న భోపాల్లోని అత్తవారింట్లో ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వివాహం జరిగిన ఐదు నెలలకే ఆమె మృతి చెందడంతో వరకట్న వేధింపుల కోణంలో కేసు నమోదైంది. భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాలా సింగ్పై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఘటన తర్వాత పరారీలో ఉన్న సమర్థ్ సింగ్ను పోలీసులు మే 22న అరెస్ట్ చేశారు. ఈ కేసుపై సుప్రీంకోర్టు కూడా విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!