

ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పునరుజ్జీవింపజేసి తెలంగాణ రైతులకు సాగునీటి ప్రయోజనాలను పునరుద్ధరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత నదిపై 152 మీటర్ల స్థాయిలో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర సమ్మతి సాధించడమే ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే సుమారు 80 టీఎంసీల నీటిని భారీ ఎత్తిపోతలు లేకుండా గురుత్వాకర్షణ ద్వారా సుందిళ్ల బ్యారేజీ వరకు తరలించే అవకాశం ఉంటుందని తెలిపారు.
సెప్టెంబర్ 1న కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య జరగనున్న అంతర్రాష్ట్ర చర్చల నేపథ్యంలో మంత్రి ఉన్నతస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో సాంకేతిక, న్యాయపరమైన అంశాలతో పాటు బ్యారేజీ ప్రయోజనాలు, మహారాష్ట్రలో ముంపు ప్రభావం, గురుత్వాకర్షణ ద్వారా నీటి తరలింపు సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. రెండు రాష్ట్రాల మధ్య అధికారిక చర్చలు ప్రారంభం కావడం ప్రాణహిత పునరుజ్జీవనంలో కీలక ముందడుగని ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!