
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకు స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటి లభించింది. “ది ఆర్డర్ ఆఫ్ దివైడ్ డబల్ క్రాస్” అనే ఈ గౌరవాన్ని స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని అందజేశారు. ఈ పురస్కారం భారత్–స్లోవేకియా మధ్య పెరుగుతున్న ద్వైపాక్షిక సంబంధాలను ప్రతిబింబిస్తోంది.
ఈ గౌరవం 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవమని ప్రధాని మోదీ పేర్కొంటూ, భారత్ మరియు స్లోవేకియా మధ్య సుదీర్ఘ స్నేహ బంధానికి అంకితం చేశారు. ఈ పురస్కారంతో మోదీకి ఇప్పటివరకు 33 అంతర్జాతీయ అవార్డులు లభించాయి. పదవి చేపట్టిన తర్వాత ఆయన 100కు పైగా విదేశీ పర్యటనలు పూర్తి చేసి, 78 దేశాలను సందర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!