

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రపంచ నేతలకు భారత సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని ప్రతిబింబించే ప్రత్యేక కానుకలను అందజేశారు. వాటిలో మణిపుర్లో తయారయ్యే ప్రత్యేక లోక్తక్ లోటస్ టీని స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్కు బహూకరించారు.
మణిపుర్లోని లోక్తక్ సరస్సు ప్రాంతంలోని తామర ఆకుల నుంచి పర్యావరణ హితంగా తయారయ్యే ఈ టీని తంగా గ్రామ మహిళలు ప్రారంభించిన ఉత్పత్తిగా గుర్తింపు పొందింది. ఈ కానుక ద్వారా ఈశాన్య రాష్ట్రాల ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు కల్పించాలన్న ఉద్దేశం స్పష్టమవుతోంది. అలాగే శాంతినికేతన్లో తయారైన లెదర్ బ్యాగ్, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు కూడా బహూకరించగా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి మణిపుర్లో తయారైన పట్టు దుపట్టాను అందించారు. అలాగే సంగీత దిగ్గజాలు భీమ్సేన్ జోషి, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గాత్రాల సీడీలను మార్బుల్ బాక్స్లో ఉంచి అధ్యక్షుడు సెర్గియె మాటరెల్లీకి అందజేశారు. మణిపుర్ బ్లాక్ రైస్ కూడా ఈ కానుకలలో భాగమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!