
సినిమాలు

నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా రక్షణ, సాంకేతికత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని పెంపొందించే దిశగా మంతనాలు జరిపారు.
పర్యటనలో భాగంగా మోదీ, మెక్రాన్ కలిసి ‘ఇండియా ఇన్నోవేట్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారతీయ స్టార్టప్లకు ప్రపంచ వేదిక కల్పించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, సాంకేతిక రంగంలో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా భారత స్టార్టప్లకు అంతర్జాతీయ అవకాశాలు, పెట్టుబడులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!