

ఆపరేషన్ సిందూర్ ప్రారంభమై మే 7తో ఏడాది పూర్తవుతున్న సందర్భంగా భారత ప్రభుత్వం ప్రత్యేక మీడియా సమావేశానికి సిద్ధమవుతోంది. గతంలో ఆపరేషన్ వివరాలు వెల్లడించిన కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మళ్లీ మీడియా ముందుకు రానున్నారు. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో నేవీ కమాండర్ ప్రేరణా దేవస్థలి మరియు ఇతర సీనియర్ అధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. ఆపరేషన్ సిందూర్కు సంబంధించిన వ్యూహాలు, దాడుల వివరాలు, ప్రాముఖ్యతపై వారు వివరించనున్నారు. అలాగే దేశ రక్షణలో మహిళా అధికారుల పెరుగుతున్న పాత్రను ప్రజలకు తెలియజేయడం కూడా ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది. గుజరాత్కు చెందిన సోఫియా ఖురేషి ఆర్మీ సిగ్నల్ కోర్లో మూడు దశాబ్దాల అనుభవం కలిగిన అధికారి కాగా, వ్యోమికా సింగ్ హెలికాప్టర్ పైలట్గా భారత వైమానిక దళంలో సేవలందిస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!