
జనరల్

సినీ నటి నిధి అగర్వాల్ పవిత్ర క్షేత్రమైన తిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని తన మొక్కులు తీర్చుకుని దైవ ఆశీస్సులు పొందారు.
దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నిధి అగర్వాల్ ప్రస్తుతం హిందీలో రెండు, తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!