
జనరల్

K2 ఎయిర్వేస్ కు చెందిన బోయింగ్ 737 కార్గో విమానం షార్జా నుంచి కరాచీ కు వెళ్తుండగా అదృశ్యమైంది. ఐదుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం నావిగేషన్ వ్యవస్థలో లోపం ఏర్పడిందని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు సమాచారం ఇచ్చిన కొద్ది సేపటికే రాడార్, రేడియో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. దీంతో పాకిస్థాన్ అధికారులు భారీ స్థాయిలో గాలింపు చర్యలు ప్రారంభించారు.
పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:18 గంటల సమయంలో పైలట్ నావిగేషన్ లోపాన్ని తెలియజేశాడు. అనంతరం విమానం అకస్మాత్తుగా దిశ మార్చుకుని వేగంగా ఎత్తు కోల్పోయి కరాచీకి పశ్చిమంగా సుమారు 155 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంపై రాడార్ నుంచి అదృశ్యమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!