

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ప్రహ్లాద జోషి నేతృత్వంలో తిరుపతిలో ఎన్డీయే కూటమి నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
మృతుల కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.25 లక్షల పరిహారం ప్రకటించాయి. తీవ్రంగా గాయపడిన వారికి రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నారు. అలాగే ప్రధానమంత్రి ప్రమాద బీమా కింద మృతుల కుటుంబాలకు రూ.2.5 లక్షల సాయం ప్రకటించారు.
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. ఘటనపై కేంద్రం ప్రత్యేక సమీక్ష నిర్వహించింది. ఈ ఘటన నేపథ్యంలో తిరుపతిలో జరగాల్సిన ఎన్డీయే విజయోత్సవ సభను వాయిదా వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని మాధవ్ పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!