
జనరల్

బంగాళాఖాతంలో ఎంవీ ఓషన్ విన్నర్ నౌక మునిగిపోవడంతో అందులోని సిబ్బంది కోసం భారత నావికాదళం సహాయక చర్యలు చేపట్టింది. విశాఖపట్నానికి సుమారు 700 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే నేవీకి చెందిన పీ-8ఐ నిఘా, గస్తీ విమానాన్ని రంగంలోకి దించింది.
సముద్రంలో రక్షణ తెప్పలను గుర్తించిన నేవీ సిబ్బంది ఇద్దరు నావికులను సురక్షితంగా కాపాడారు. నౌకలోని మిగిలిన సిబ్బంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రతికూల సముద్ర పరిస్థితులను ఎదుర్కొంటూ నేవీ సహాయక, రక్షణ చర్యలను ముమ్మరం చేసింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!